Wednesday, April 24, 2024

breaking : నా భ‌ర్త‌ది హ‌త్యే..న్యాయం చేయ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటా..నందిని..

విశాఖ ప‌ట్నం..కేజీహెచ్ మార్చురీ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. మార్చురీ ఎదుట లైన్ మెన్ బంగార్రాజు కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న‌కి దిగారు. ఏనుగుల‌పాలెంలో రెండురోజుల క్రితం లైన్ మెన్ బంగార్రాజు దారుణ హ‌త్య జ‌రిగింది. ఈ హ‌త్య‌లో అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేశారు. కాగా పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. నా భ‌ర్త హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితులు ల‌క్ష్మ‌ణ‌రావు,గోవింద‌రావుని అరెస్ట్ చేయాల‌ని బంగార్రాజు భార్య నందిని డిమాండ్ చేశారు. త‌న‌కు అన్యాయం జ‌రిగితే ముగ్గురు పిల్ల‌ల‌తో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని తెలిపింది. త‌న‌కి న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న భ‌ర్త మృత‌దేహాన్ని తీసుకెళ్ళే ప్ర‌స‌క్తే లేద‌ని నందిని స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement