Saturday, April 20, 2024

Breaking : వైరా గురుకుల పాఠ‌శాల‌లో 13మంది విద్యార్థుల‌కు క‌రోనా..

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతోంంది. ఓ పాఠ‌శాల‌లో 13మంది విద్యార్థుల‌కు క‌రోనా సోకింది. ఈ సంఘ‌ట‌నఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వైరా గురుకుల పాఠశాల లో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది..650 మంది విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు చేయగా… ఇందులో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా… పాఠశాల అధికారులు ప్రకటన చేశారు. ప్రస్తుతం.. 13 మంది విద్యార్థులను క్వారంటైన్‌ కు తరలించామని… అలాగే వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. 13 మంది విద్యార్థులతో సన్నిహితంగా ఉన్న వారికి మరో సారి ప్రత్యేకంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement