Friday, March 29, 2024

Breaking : వాగులో కొట్టుకుపోయిన జీప్ – 11మందిని కాపాడిన స్థానికులు

కుంటాల ప్రభా న్యూస్ : మహారాష్ట్ర నుండి జీప్ లో 11మంది పని నిమిత్తం నర్సాపూర్ వెళ్లారు. మ్యాప్ ద్వారా కిన్వాట్ వెళ్దామని ఓల గ్రామం నుండి సూర్య పూర్ వెళ్లారు. వారికి దారి దొరకక పోవడం వల్ల తిరిగి ఓలాకు వద్దామని పయనమయ్యారు. శివాలయం వైపు కాలువలలో జీపుతో సహా 11 మంది ఇరుక్కుపోవడాన్ని ఎమ్మార్వో చూశారు. దాంతో స్థానిక సర్పంచ్ కి సమాచారం ఇచ్చారు. జెసిపి మిషన్ సహాయంతో వారిని సురక్షితంగా గా బయటకు తీసుకు వ‌చ్చారు. బిఆర్ వేలు పంచాయతీ సెక్రెటరీ డి ఎల్ పి ఓ. ఎం పి డి ఓ. ఎం పి ఓ. ఎస్ ఐ మేడం అందరూ అక్కడికి చేరుకున్నారు. దీంతో జీపులో ఉన్న 11 మందిని కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement