Thursday, April 25, 2024

Breaking : జమ్ము కశ్మీర్‌ లో భారీ వర్షం… ఆగిన రాహుల్‌ గాంధీ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్రకు ఆటంకం ఏర్ప‌డింది. జ‌మ్ముకశ్మీర్ లో బుధ‌వారం రాహుల్ గాంధీ పాద‌యాత్ర ప్రారంభ‌మైనంది. యాత్ర కొన‌సాగుతున్న స‌మ‌యంలో బ‌నిహార్ లో భారీ వర్షం ప‌డ‌టంతో రాహుల్ గాంధీ జ‌మ్ముకు తిరిగి వ‌చ్చారు. వ‌ర్షం త‌గ్గితే ఈరోజు యాత్ర కొన‌సాగిస్తారా.. మ‌ళ్లీ రేపు ప్రారంభిస్తారా అనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద భార‌త్ జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ మంచి స్పంద‌న ల‌భిస్తున్న‌ట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. కొన్ని చోట్ల వ‌ర్షంను సైతం లెక్క‌చేయ‌కుండా రాహుల్ జోడో యాత్ర కొన‌సాగిన తీరు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఎక్క‌డికి వెళ్లినా వేల సంఖ్య‌లో జ‌నం రాహుల్ గాంధీ యాత్ర‌లో భాగ‌స్వాములు అవుతున్నారు. ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు సైతం రాహుల్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల గుండా జ‌మ్ము క‌శ్మీర్ కు రాహుల్ యాత్ర చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement