పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బ్యాంక్ సిబ్బంది వేధింపులకు అత్తాకోడళ్లు మృతి చెందారు. గుండెపోటుతో కోడలు భారతి మృతి చెందింది. మనస్తాపంతో ఉరివేసుకుని అత్త అంజమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రైవేట్ బ్యాంక్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
- Advertisement -