Thursday, March 28, 2024

Breaking: బిహార్‌లో రోడ్డు ప్ర‌మాదం – ఐదుగురు మృతి

ప్ర‌యాణికులతో వెళ్తున్న ఆటోని డంప‌ర్ ఢీకొట్ట‌డంతో అయిదుగురు చ‌నిపోయారు. మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలోని న‌లంద జిల్లాలో ఇవ్వాల జ‌రిగింది. హర్గవా గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మూడు చక్రాల వాహనాన్ని డంప‌ర్ బ‌లంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చ‌నిపోయార‌ని నలంద (సదర్) పోలీస్ ఆఫీస‌ర్‌ షిబ్లి నోమాని తెలిపారు.

లోపల చిక్కుకున్న మరో నలుగురిని స్థానికులు, పోలీసులు రక్షించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నలందలోని సదర్ ఆస్ప‌త్రికి తరలించారు. కాగా, ప్రమాదం అనంతరం డంపర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆందోళనకు దిగిన గ్రామస్తులు యాక్సిడెంట్‌కు కార‌ణ‌మైన వాహనానికి నిప్పుపెట్టి రాష్ట్ర రహదారిని దిగ్భంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement