Friday, April 26, 2024

Breaking : చెన్నైలో డ్రగ్స్‌ కలకలం.. ట్యాబ్లెట్ల రూపంలో రవాణా.. ఇద్దరి అరెస్ట్‌ ..

చెన్సైలో అక్రమ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కలకలం రేపుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగ్‌ ముఠా అడ్డదారులు తొక్కుతూ దందా కొనసాగిస్తోంది. ఈ రోజు నెల్లూరు నుంచి చెన్నైకి అక్రమంగా డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ట్యాబ్లెట్ల రూపంలో డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 420 ట్యాబ్లెట్స్‌ స్వాధీరం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఇందులో సూత్రదారులు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement