Monday, March 25, 2024

Breaking : మూడు రాజ‌ధానుల పేరుతో డ్రామాలాడొద్దు : సోము వీర్రాజు

Ap News : అధికార పార్టీ వైసీపీ నాయ‌కుల‌పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. ఏపీలో అధికార పార్టీ నాయ‌కుల‌కు బుర్ర‌లేద‌ని, అమ‌రావ‌తి రైతులు సిక్కోలుకు ఎందుకు రాకూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. రైతుల‌పై అక్క‌స్సుతోనే వైసీపీ స‌ర్కార్‌ వికేంద్రీక‌ర‌ణను తెర‌పైకి తెచ్చార‌న్నారు. మూడు రాజ‌ధానుల పేరుతో డ్రామాలు ఆడొద్ద‌ని హెచ్చ‌రించారు. పేద‌ల ఇళ్ల‌కు జ‌గ‌న‌న్న పేరు పెట్టుకోవ‌డానికి వీల్లేద‌ని, ఇదే విష‌యాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. పీఎం ఆవాస్ యోజ‌న పేరు పెట్ట‌క‌పోతే నిధులు నిలిపివేస్తామ‌ని సోము వీర్రాజు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement