Friday, April 19, 2024

Breaking : పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే వివరాలు వెల్లడిస్తాం : సీపీ మహేష్‌ భగవత్‌


బాలిక ఇందు మృతిపై విచారణ కొనసాగుతుందని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. సింగిల్‌గానే ఇందు బాలిక స్కూల్‌ నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించడం జరిగిందని, డెడ్‌ బాడీపై గాయాలు కనిపించలేదన్నారు. ఇందు మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. తల్లిదండ్రులు వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నారని, క్లూస్‌ దొరికిన, విచారణను బట్టి వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. హత్య, లేక ఆత్మహత్య కోణంలో కూడా విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. గంజాయి బ్యాచ్‌ పై అనుమానాలు ఉన్నట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్న తరుణంలో ఆ కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే కేసు విచారణకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోస్టు మార్టం పూర్తయిన తరువాత ఇందు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement