Tuesday, April 23, 2024

Breaking – సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి – ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘ‌ట‌న
శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో కుటుంబ పెద్ద జైనాభి(60), ఈమె కుమారుడు దాదు(36), కోడలు సర్ఫున్ని (28) మూడేళ్ళ మనవరాలు బేబీ ఉన్నారు. సిలిండర్ పేలుడు ధాటికి నేలమట్టమ‌య్యాయి ప‌క్క‌న ఉన్న ఇళ్లు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో తండ్రి కొడుకు రజాక్, అభ్దుల్లా…ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement