Friday, March 29, 2024

Breaking : కారును ఢీకొట్టిన కంటైనర్ – ఐదుగురికి గాయాలు – ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం

ఆర్మూర్ మండలం చెపూర్ గ్రామ శివారు నేషనల్ హైవే 63 రోడ్డులో వేకువజామున కంటైనర్ కారును ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురికి గాయాలు కావడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, వల్లంపల్లి గ్రామంలో పెళ్లికి హాజరై హైదరాబాద్ కి కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..కాగా నరేందర్, ఉమా, మహేష్, ఆనంద్, రాజులను చెపూర్ శివారులో పశువుల దాన తో ఉన్న కంటైనర్ కరీంనగర్ వైపు వెళుతూ అతివేగంతో కారును ఓవర్టేక్ చేయబోయి కారుని ఢీ కొట్టి కంటేనర్ బోల్తా పడింది..కాగా కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు అయ్యాయి..ఆనంద్, ఉమలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్,ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement