Thursday, March 28, 2024

Breaking : క్రేన్ స‌హాయంతో మ‌హిళ‌లతో స‌హా కారుని తీసుకెళ్లిన పోలీసులు..

మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డ‌ప‌డంలో మ‌గ‌వారే కాదు మ‌హిళ‌లు ముందుంటున్నారు. దాంతో ప‌లు ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ ఛాద‌ర్ ఘాట్ లో స్విప్ట్ కారు భీభ‌త్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్య‌క్తిని ఢీకొట్టి ..కొద్ది దూరం వెళ్ళి డివైడ‌ర్ ని ఢీకొంది. కారు న‌డుపుతోన్న మ‌హిళ‌కి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన త‌ర‌వాత‌ మహిళ కారులో నుండి దిగకుండా నానా హంగామా సృష్టించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ ఎంతకీ కారు దిగకపోవడంతో క్రేన్ సహాయంతో కార్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళ మద్యం మత్తులో ఉందా…లేక మతిస్థిమితం కోల్పోయిందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement