Saturday, April 20, 2024

Breaking : కారు బోల్తా.. ఇద్దరు మృతి

అదుపుత‌ప్పి స‌ర్వీస్ రోడ్డులో కారు బోల్తా ప‌డి ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో చోటుచేసుకుంది. పెద‌కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి సర్వీస్ రోడ్లో బోల్తా ప‌డింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. అనంత‌రం క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement