Saturday, April 20, 2024

Breaking : బిడ్డ‌తో స‌హా కెనాల్ లో దూకిన‌ తల్లి..

కెనాల్ లో దూకి తల్లి ,బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మ సాగర్ లో చోటుచేసుకుంది. ఆత్మ సాగర్ కు చెందిన వేములవాడ వనిత(28), కూతురు శాన్వి(4) తో కలిసి ఎస్సారెస్పీ కెనాల్ లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన వనిత కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.. శనివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తల్లీకూతుళ్లు ఆదివారం ఎస్సారెస్పీ కెనాల్ లో తేలడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న మెట్పల్లి సీఐ ఎల్. శ్రీను సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement