Saturday, April 20, 2024

Breaking : శంషాబాద్ విమానాశ్రయంలో.. విదేశీ కరెన్సీ పట్టివేత‌

శంషాబాద్ (ప్రభ న్యూ స్) : శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ ఇంటలిజెంట్ అధికారులు విదేశీ కరెన్సీ నోట్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఫరాన్ అనే మహిళ శంషాబాద్ విమానాశ్రయం నుండి సార్జా కు 6E-1421 గల విమానంలో అనుమానస్పంద‌గా కనిపించిన సయ్యద్ పరాన్ మహిళను అదుపులోకి తీసుకొని సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ బృందం తనిఖీలు చేశారు. కాగా సదరు మహిళ వద్ద రూ.30 వేల సౌదీ రియాల్ తీసుకొని వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అంనతరం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు కస్టమ్స్ అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement