Saturday, April 20, 2024

Braking : బస్సు బోల్తా .. పది మందికి గాయాలు ..

తల్లాడ ప్ర‌భ‌న్యూస్ : గుంత‌ను త‌ప్పించ‌బోయి ప్ర‌మాద‌వ‌శాత్తు టిఎస్ ఆర్ టిసి బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ సంఘ‌ట‌న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. కొత్తగూడెం నుండి హైదరాబాద్ బయలుదేరిన బస్సు రాత్రి 12:45 అంబేద్కర్ నగర్ దగ్గర గుంత‌ను తప్పించబోయి బోల్తా పడింది. బ‌స్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా అందులో పది మందికి గాయాలు.. గాయాలపాలైన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైరా సిఐ. వసంత కుమార్, తల్లాడ ఎస్ఐ ఎం.సురేష్ , గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు సాయంతో 108 ద్వారా ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement