Thursday, March 28, 2024

బ్రహ్మ కుమారీస్ అధ్యక్షురాలు కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని గురువారం(93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె… ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి కన్నుమూయడంతో బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా హృదయ మోహిని బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఢిల్లీ జోనల్ అధిపతిగా ఆమె పని చేశారు. అంతేకాదు, అన్ని ఖండాల్లో ఆధ్యాత్మికత, సాత్విక జీవనశైలి, రాజయోగ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆమె విశేష కృషి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement