Wednesday, March 27, 2024

ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలు: మంత్రి బొత్స సత్యనారాయణ

వైసీపీ ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్నవి అర్థం లేని విమర్శలని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వ పథకాల వలన ఆర్థికాభివ్రద్ధి పెరుగుతుందన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ విషయాలు తాము చెబుతున్నవి కావు…ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణులే చెబుతున్నారు ప్రజల కష్ట సుఖాలు తెలిసే ప్రభుత్వం తమదన్నారు. చంద్రబాబు తన మేథాశక్తికి పదును పెడితే..ఇలాంటివి అర్థమవుతాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement