Saturday, April 20, 2024

ఆసిస్ బౌలర్ల విజృంభణ.. కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియాను కట్టడి చేశామనే ఆనందాన్ని అభిమానులకు ఎంతో సేపు ఉండకుండా చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 38 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా (51 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అజింక్యా రహానే (71 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు), శ్రీకర్ భరత్ (14 బంతుల్లో 5 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున ఐదుగురు బౌలర్లు తలా ఒక వికెట్ సాధించారు. ప్రస్తుతం భారత్ మరో 318 పరుగులు వెనుకబడి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement