Friday, April 26, 2024

టీడీపీ గెలిచి ఉంటే ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు రూ.5 లక్షలు వచ్చేవి: బోండా ఉమ

జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ ఏపీ స‌ర్కారు కాలం గ‌డుపుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. డ్వాక్రా మహిళలను ప్ర‌భుత్వం మోసం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ప్రతి డ్వాక్రా గ్రూపున‌కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఆ హామీ మ‌రిచింద‌న్నారు.

అంతేగాక‌, వైసీపీ గెలిస్తే రుణాల‌ను మొత్తం మాఫీ చేస్తామని మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలిచి ఉంటే ప్రతి గ్రూపుకు 5 లక్షలు వచ్చేవని ఆయ‌న చెప్పారు. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో మహిళలకు రెండు సార్లు రెండు లక్షల రపాయలు ఇచ్చామని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల ముందు వైసీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలోని ప్రతి పథ‌కం బోగస్ అని బోండా ఉమ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement