Wednesday, April 24, 2024

మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసిన శిల్పాశెట్టి

పోర్న్ వీడియోల కేసులో తనపై మీడియాలో అనేక కథనాలు వస్తుండటంతో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలపై ఆమె ముంబై హైకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. పోర్న్ వీడియోల కేసులో తన భర్త రాజ్‌కుంద్రాపై పోలీసులు కేసు నమోదు చేస్తే.. తన ఫోటోలు, వీడియోలను కూడా మీడియా సంస్థలు వాడుతున్నాయని శిల్పాశెట్టి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో తన పాత్ర ఉందని పోలీసులు చెప్పకపోయినా మీడియాలో తనపై కథనాలు వస్తున్నాయని, దీంతో తన పరువుకు భంగం కలుగుతోందని ఆమె మండిపడింది.

పలు జాతీయ మీడియా సంస్థలు, పలువురు జర్నలిస్టులపై ఆమె వేసిన‌ పరువునష్టం దావా శుక్రవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా నటనపై ఆసక్తితో వచ్చిన వారిని రాజ్‌కుంద్రా బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్‌కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ సీఎం జగన్‌పై ఆర్.నారాయణమూర్తి ప్రశంసల వర్షం

Advertisement

తాజా వార్తలు

Advertisement