Thursday, March 28, 2024

మానవత్వాన్ని చాటుకున్న వినోద్ కుమార్

రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆస్పత్రికి తరలించి తను ఉదారతను చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్‌కు ఈ సంఘటన ఎదురైంది.

జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న దారిలో మల్యాల్ ఎక్స్ రోడ్డులో గాయాలతో పడిపోయి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసి వెంటనే బోయినపల్లి వినోద్ కుమార్ వాహనాన్ని ఆపి ప్రత్యేక వాహనంలో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులను అప్రమత్తం చేశారు. ఉదారతను చూపిన వినోద్ కుమార్ సేవల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement