Thursday, March 28, 2024

AP | నెత్తురోడిన రోడ్లు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

కోడుమూరు, ఓర్వకల్ (ప్రభ న్యూస్‌): కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చ‌నిపోయారు. విధి చిన్నచూపు చూడటంతో కాలు కోల్పోయిన వ్యక్తికి కృత్రిమ కాలుతో అవయవాన్ని సరిచేయించుకొని తిరిగివస్తుండగా కోడుమూరు పట్టణ సమీపంలోని ప్యాలకుర్తి రహదారిలో యాక్సిడెంట్ జ‌రిగింది. కారు, బైకు ఢీకొని కల్వర్టుకు గుద్దుకోవ‌డంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న యలమ రాజు, యలమ నారాయణ, వెంకటస్వామి అక్కడికక్కడే చ‌నిపోయారు. కాగా కారు డ్రైవర్‌ రాజు నాయక్‌ మోటార్ సైకిల్‌పై వెళ్తున్న కోడుమూరుకు చెందిన కాశీం తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా కాలు లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి జైపూర్‌ కట్టు అమర్చుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ వ్యక్తితో పాటు అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన కలచివేసింది. ఇదిలా ఉంటే ఓర్వకల్‌ మండలం హుస్సేనాపురం గ్రామ సమీపంలో ఆటో ద్విచక్రవాహనం ఢీకొని రవీంద్ర కుమార్‌ అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement