Friday, March 29, 2024

రక్తమోడిన మానుకోట రహదారి.. కూలీలా ఆటోపై పడిన గ్రానైట్ లారీ

మరిపెడ, (ప్రభ న్యూస్): వారంతా రోజు కూలీలు.. పని ముగించుకొని ఆటోలో తిరుగు పయణమైయ్యారు. ఇంతలో గ్రానైట్ లారీ నిర్లక్ష్యంతో నడపటంతో లారిపై ఉన్న పెద్ద బండలు కూలీలతో వెళ్తున్న ఆటో పై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే చ‌నిపోయారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంది.. మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో జాతీయ రహదారి 365పై శనివారం రాత్రి జరిగింది.

మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగూడూర్ మండలం మంగోరిగూడెం గ్రామానికి చెందిన కూలీలు మానుకోట వెళ్తుండగా మహబూబాదాద్ వైపు నుంచి స్టోన్ లోడ్తో లారీ వస్తోంది. ఈ క్రమంలో కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఎదురుగా వసున్న ఆటోపై గ్రానైట్ లోడ్ పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బానోత్ సుమన్(35), ఎక్కలపు శ్రీకాంత్(3౦) అక్కడికక్కడే చ‌నిపోయారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న మరో ఆరుగురు డెంక్యాల నవీన్, లింగంపెల్లి రాంబాబు, బానోత్ రాము, బానోత్ రమేష్ (ఆటో డ్రైవర్), నునావత్ వీరన్న, బొడ్డు శేఖర్ లకు గాయలైయ్యాయి. కాగా నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. క్షతగాత్రులకు మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement