Saturday, April 20, 2024

రక్తదానం ప్రాణదానంతో సమానం : నారా లోకేశ్

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అందరిలో ఉన్న అపోహలను పోగొట్టి, అందరూ రక్తదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కల్పిద్దామని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement