Monday, April 15, 2024

Breaking: నంద్యాల జిల్లాలో పేలుడు.. ఐదుగురికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పేలుడు ఘటన జరిగింది. జిల్లాలోని ఆలమూరులో కల్లు దుకాణం వద్ద పేలుడు ఘటన జరగడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. భారీ శబ్ధంతో ఈ పేలుడు ఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నాటుబాంబు పేలిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement