Thursday, April 25, 2024

ప్రాంతీయ పార్టీ మ‌ద్ద‌తుతో త్రిపురలో బిజెపి పాగా

త్రిపుర లోని 60 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో బిజెపి 28 స్ధానాల‌లో అధీక్యంలో ఉంది.. ఈ ఎన్నిక‌ల‌లో కొత్త‌గా బ‌రిలోకి దిగిన ప్రాంతీయ పార్టీ తిప్రా పార్టీ 13 చోట్ల ముంద‌జ‌లో ఉంది.. ఇక కాంగ్రెస్ , లెఫ్ట్ కూట‌మి 19 స్థానాల‌లో ముందంజ‌లో కొనసాగుతున్న‌ది.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కూట‌మి విజ‌య‌వ‌కాశాల‌ను ప్రాంతీయ పార్టీ త్రిపా తీవ్రంగా దెబ్బ‌తీసింది.. ఈ కూట‌మికి ప‌డాల్సిన ఓట్ల‌ను చీల్చండ‌తో స‌క్సెస్ అయిన ఈ పార్టీ బిజెపికి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలున్నాయి.. దీంతో బిజెపి,త్రిపాలు త్రిపుర‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌వ‌చ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement