Friday, March 29, 2024

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలి: బండి

టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ కేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని.. వాళ్లెవరో సీఎం కేసీఆర్‌కు తెలుసు అని బండి సంజయ్ ఆరోపించారు. అసెంబ్లీలో కరోనా టెస్టులకు బదులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని, లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. హైదరాబాద్‌లో ఓ హోటల్ అడ్డాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్ దందా చేస్తున్నారని విమర్శించారు. ‘అదేదో గ్రీన్ ఛాలెంజ్ అని చేస్తున్నారు కదా… నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా… అంటే కొకైన్… డ్రగ్ తీసుకుంటారు కదా… దానిని టెస్ట్ చేయించుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నా… నువ్వు, నీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా… దమ్ముంటే రండి, టెస్టుకు బ్లడ్ ఇస్తారా’ అంటూ సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement