Wednesday, April 24, 2024

హుజూరాబాద్‌లోనూ దుబ్బాక సీన్ రిపీట్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో లక్ష మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే తరహా ప్రకటనలు ఇస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, 100 మంది సీఎంలు వచ్చినా ఈటెల రాజేందర్ గెలుపును ఆపలేరని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని… నోట్ల కట్టలు వెదజల్లినా ప్రజలు ఈటెలకే పట్టం కడతారని చెప్పారు.

దుబ్బాక ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఎంత కష్టపడి పని చేసిందో… హుజూరాబాద్‌లో కూడా అదే విధంగా పని చేస్తామని రఘునందన్ రావు అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఒక్క బలమైన బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన గెలుపు రాదన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు.

ఈ వార్త కూడా చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించినా వారు టీఆర్ఎస్‌లోనే చేరుతారు

Advertisement

తాజా వార్తలు

Advertisement