Thursday, April 25, 2024

మొక్కును తీర్చుకునేందుకు ఈట‌ల అభిమానుల పాద‌యాత్ర ..

క‌రీంన‌గ‌ర్ నుండి తిరుమ‌ల‌కు పాద‌యాత్ర చేప‌ట్టారు బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అభిమానులు.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల గెలిచిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొందరు కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల వెంకన్నకు మొక్కు తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ యాత్ర కొద్దిరోజుల క్రితం ప్రారంభ‌మ‌యింది..కాగా ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంది. ఈ సందర్భంగా పాతబస్టాండ్ వద్ద ఏపీ బిజెపి నాయకులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు గరికపాటి రమేష్ బాబు, పుణ్యం ఢిల్లీ కుమార్, ఇమ్మడిశెట్టి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement