Friday, April 26, 2024

జగన్ సర్కారుకు బీజేపీ నేతల హెచ్చరిక

కరోనా వైరస్ వల్ల ప్రజలు అల్లాడిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం పన్నులు పెంచడం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.

సీఎం జగన్ పన్నులు పెంచుతుంటే ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కొత్త పన్నులు వేయాలంటే సీఎం జగన్ ఆ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. జగన్ సర్కారు పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే ఏపీ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement