Friday, April 19, 2024

TSPSC స్కామ్ – సిట్టింగ్ జడ్జితో విచార‌ణ – గ‌వ‌ర్న‌ర్ ను కోరిన బిజెపి నేత‌లు

హైద‌రాబాద్ – తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీక్‌ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఈటెల రాజేందర్, ఏవీఎన్ రెడ్డిలు గవర్నర్ తమిళిసైను కలిశారు. ఈ లీకేజ్ వ్య‌వ‌హారంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని గవర్నర్ కు విన్న‌వించారు.. ఈ ఘ‌ట‌న‌కు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ వినిపించారు.. అలాగే ప్ర‌స్తుత TSPSC చైర్మన్ ను , సభ్యులను డిబార్ చేసి కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని బిజెపి నేత‌లు త‌మిళ‌సై దృష్టికి తెచ్చారు.. ఇదే స‌మ‌యంలో లీకేజ్ వ‌ల్ల ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని ప్ర‌తిపాదించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement