Saturday, April 20, 2024

తిరుపతిలో వైసీపీ దొంగ ఓట్లు.. వీడియో బయటపెట్టిన బీజేపీ నేత

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ దౌర్జన్యాలపై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద‌యం 7 గంట‌ల‌ నుంచే ఇత‌ర ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి వైసీపీ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆయన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘వీరందరూ తిరుమల దర్శనానికో.. శ్రీకాళహస్తి దేవుడి దర్శనానికో వెళ్తున్నారని పొరపాటు పడకండి. తిరుపతి ఉప ఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేల అధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రైవేట్ కళాశాల బస్సులలో, ఇత‌ర‌ ప్రైవేట్ బస్సులలో వీరందరినీ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారు’ అంటూ విష్ణువర్థన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

ఇటువంటి రాజ‌కీయాలతో వైసీపీ ఏం సాధించాల‌ని అనుకుంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తూ దొంగ ఓట్ల‌తో గెల‌వాల‌నుకోవ‌డం ఏంట‌ని నిల‌దీశారు. నిజ‌మైన‌ ఓట‌ర్ల‌ను ఓటు హ‌క్కు స‌ద్వినియోగం చేసుకోనివ్వ‌కుండా చేయ‌డం స‌రికాద‌ని చెప్పారు. మ‌రోప‌క్క పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు చేతులు ఎత్తేయ‌డం, దేశంలో ఎక్క‌డా లేనివిధంగా అప్ర‌జాస్వామిక విధానంలో ఎన్నిక జ‌రుగుతుండ‌డం BJదుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు. రాష్ట్ర పోలీసులు, ఎన్నిక‌ల సిబ్బందిపై, దొంగ ఓట్లు వేసిన వారిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ మాండ్ చేస్తోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement