Thursday, April 25, 2024

వకీల్ సాబ్ ని చూస్తే జగన్ కు భయం!

ఏపీ సీఎం జగన్ కు పవన్..వకీల్ సాబ్ భయం పట్టుకుందని అన్నారు బీజేపీ నేత సునీల్ దియోదర్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఇవాళ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడం పట్ల అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జనసేన మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కూడా ఈ  పరిణామంపై తీవ్రంగా స్పందించింది. తిరుపతిలోని ఓ థియేటర్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్ చార్జ్ సునీల్ దియోదర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందన్నారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలందరూ వకీల్ సాబ్ సినిమా చూడండి అంటూ ఆయన పిలిపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement