Thursday, April 25, 2024

జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడమేంటి?

నెల్లూరులో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్‌ను టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు విష్ణుమూర్తితో పోల్చడం అభ్యంతరకరంగా ఉందన్నారు. రమణదీక్షితులు వ్యాఖ్యలు టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. టీటీడీలో అన్యమతస్తులు లేరని చెప్పడం దారుణమన్నారు. అన్యమతస్తులను వేరే విభాగానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు రాజకీయంగా మాట్లాడాలని భావిస్తే టీటీడీ ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని భానుప్రకాష్‌రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement