Tuesday, March 26, 2024

కాంగ్రెస్ కంచుకోట‌లో స‌త్తా చాటిన బీజేపీ : ఈటల రాజేంద‌ర్‌

కాంగ్రెస్ కు కంచుకోట‌లా ఉన్న మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ స‌త్తా చాటింద‌ని ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. మునుగోడులో బీజేపీ కి ప్ర‌జ‌ల నుంచి భారీగా మ‌ద్ద‌తు వ‌చ్చింద‌న్నారు. ఇంతలా ఆద‌రించిన మునుగోడు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్‌కు చావుతప్పి కన్నులొట్టబోయినట్లయిందన్నారు. ఎన్నికల వేళ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎంతకైనా దిగజారుతారని ఎమ్మెల్యే ఈటల విమర్శించారు. హుజూరాబాద్లో తనను ఓడించాలని కుట్రలు చేశారన్నారు. డబ్బుతో ప్రలోభ పెట్టబోయామని బీజేపీపై ఆరోపణలు చేశారని, ఎనిమిదేళ్లుగా కమ్యూనిస్టులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఓటమి భయంతోనే వారిని మచ్చిక చేసుకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement