Saturday, April 20, 2024

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒలింపిక్స్‌కు వెళ్తున్న బ్యాడ్మింటన్‌ ప్లేయర్ల కోచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ షాక్‌ తిన్నారు. కోవిడ్‌ టైంలో గుంపులుగా సత్కారాలు పెట్టడంపై కోచ్‌లు అసహనం వ్యక్తం చేశారు. సన్మానం కోసం ఒలింపియన్‌ కోచ్‌లు స్టేజ్‌ మీదకు వచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బతిమిలాడగా పీవీ సింధు, సాయి ప్రణీత్‌ స్టేజ్‌ మీదకు వచ్చారు. కాగా గుంపుల మధ్య సన్మాన కార్యక్రమం నిర్వహించడంపై పలువురు క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీలో రేవంత్ జోష్

Advertisement

తాజా వార్తలు

Advertisement