Thursday, April 18, 2024

వ్యాక్సిన్‌ వేసుకోండి.. బిర్యానీ, గోల్డ్‌ కాయిన్‌ బహుమతిగా పొందండి

తమిళనాడు: కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చెన్నైలోని కోవలం ప్రాంతానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి బిర్యానీ, డ్రా పద్ధతిలో మోటార్‌ సైకిల్‌, వాషింగ్‌మెషీన్‌, గోల్డ్‌ కాయిన్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు వారు ప్రకటించారు.

కోవలం ప్రాంతంలో ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు ఉత్సాహం చూపడం లేదు. అందువల్ల కోవలం, చుట్టుపక్కల గ్రామాల్లో వైరస్‌ ఉధృతి తీవ్రతరం అవుతుండడంతో, దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ఆరోగ్యశాఖ స్వచ్ఛంధ సేవాసంస్థలకు పిలుపు నిచ్చింది. ఆ మేరకు ‘కరోనా రహిత కోవలం’ అనే పేరుతో ఆ ప్రాంతానికి చెందిన యువకులు వ్యాక్సిన్‌ వేయించుకొనే వారికి ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement