Thursday, April 25, 2024

BIG BREAKING : చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

భూపాలపల్లి (ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పిల్లలు గురువారం చెరువులో మునిగి మృతి చెందిన హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి తాటికంటి రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం దశ దిన కర్మ నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమంకు మొగుళ్లపల్లి గ్రామానికి గుండాల సురేశ్-భాగ్యలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు వర్షిత్ (7), కమలాపురం మండలం గుండెడు గ్రామానికి చెందిన కోటేశ్వర్రావు రాణి దంపతులు కుమారుడు (11)లతో కలిసి వచ్చాడు. రమేష్ ఇంటి సమీపంలో ఉన్న కుంట వద్దకు ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి కుంట నీటిలో పడిపోయారు. అటువైపుగా ఎవరు గమనించకపోవడంతో పిల్లలు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారుల అకాల మృతితో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. దుంపిల్లపల్లితో పాటు మొగుళ్లపల్లి గుండెడు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement