Friday, April 26, 2024

Big Breaking : ఆ నలుగురు ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలి : రేవంత్‌ రెడ్డి

హైద‌రాబాద్ : బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి కాంగ్రెస్‌ను లేకుండా చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. వ్యూహాత్మకంగా వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రోహిత్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్ట్‌ ఎలా నిలబడుతుందన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్‌ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే ఏసీబీ నడుస్తోందని, నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారని నిలదీశారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలను కూడా నిందితులుగా చేర్చాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement