Friday, April 19, 2024

Bharat Jodo Yatra: తెలంగాణలో రెండోరోజు కొనసాగుతున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో నిన్న ప్రవేశించింది. రెండో రోజు భారత్‌ జోడో యాత్ర ఈ రోజు మక్తల్‌ నుంచి ప్రారంభమైంది. దండు, కాచ్వార్‌ మీదుగా బొందలకుంట వరకు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రైతులతో భేటీ కానున్నారు. ఈ యాత్రలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్‌ నాయకులు ముచ్చటించి.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన ప్రణాళికలను వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement