Thursday, April 25, 2024

Bharat Jodo Yatra : ఏపీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

క‌ర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం హాల్వా హరి పరిధిలోని చేత్రగుడి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. వారితో పాటు వేలాదిమంది కార్యకర్తలు నేతలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో నడిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement