Thursday, April 25, 2024

ఎక్క‌డ ఉన్నా భ‌ద్రాద్రి ఆల‌యం అభివృద్దికి స‌హాయ‌మందిస్తా..తుమ్మ‌ల‌

యాదాద్రి నిర్మాణం త‌ర్వాత భ‌ద్రాద్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు తెలిపారు. తాను అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఎక్కడ ఉన్నా భద్రాద్రి ఆలయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యం ఆ శ్రీరామచంద్రుడి దయతో కొనసాగుతోందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ కేటాయించిన నిధులతో సుమారు 10 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం అవబోతోందన్నారు. భద్రాచలం శ్రీ సీతారామ కమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో వసతి గృహం, కల్యాణమండపం సముదాయం నిర్మాణానికి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్మ సేవా సమితి చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం భద్రాచలం పట్టణానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement