Friday, April 19, 2024

నార్వే రాయబారి ఎరిక్ సోల్ హీమకు నచ్చిన.. బెంగళూరు..ఉడిపి రైల్వే లైన్

బెంగళూరు..ఉడిపి రైల్వే లైన్ ..దీన్ని ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే రెప్పలు ఆర్పటం మరచిపోవాల్సిందే. అంత సుందరంగా ఉంటుంది. చిక్కటి పచ్చదనం పరుచుకున్న, దట్టమైన అటవీ ప్రాంతం నుంచి పాములా సాగిపోతూ ఉంటుంది. ఈ ఉడిపి రైల్వే లైన్ నార్వే రాయబారి ఎరిక్ సోల్ హీమ్ కు తెగ నచ్చేసింది. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. ‘‘అద్భుతమైన భారత్. పచ్చదనం మధ్య సాగిపోయే రైల్వే లైన్ ఎక్కడైనా ఉందా కర్ణాటకలోని బెంగళూరు-ఉడుపి రైల్వై లైన్ లో సక్లేష్ పూర్ నుంచి కుక్కే సుబ్రమణ్య వరకు అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. ఈ మార్గంలో సొరంగాలు, లోయలు, నదులు కనిపిస్తాయని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement