Wednesday, March 27, 2024

టిఫిన్​ బాంబ్​ పేలి బాలుడి మృతి.. పశ్చిమ బెంగాల్​లో ఘటన

కోల్‌కతా సమీపంలో స్టీల్ టిఫిన్ బాక్స్ పేలిన ఘటనలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా రహరా పోలీస్ స్టేషన్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది. చెత్త ఏరుకునే (రాగ్-పిక్కర్) తన తాత సేకరించిన టిఫిన్ బాక్స్ ను తెరవడానికి ఆ బాలుడు ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు సంభవించింది. దీంతో షేక్ సాహిల్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అతడిని కోల్‌కతాకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న బరాక్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో అప్పటికే అతడు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. సాహిల్ తాత అయిన అబ్దుల్ హమీద్ అతను స్టీలు టిఫిన్ బాక్స్ తీసుకొని తమ ఇంటి లోపలికి తీసుకువచ్చాడని చెప్పాడు. సంఘటన జరిగినప్పుడు బాక్స్​ తరెచి దానిలో ఏముందో చూడాలని తన మనవడు సాహిల్‌కు తానే చెప్పానని అతను ధ్రువీకరించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement