Saturday, April 20, 2024

సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్ల హల్ చల్

అనంతపురం, (రాయలసీమ ప్రభవెబ్ ప్రతినిధి ) : శ్రీ సత్యసాయి జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల గుంపు హల్ చల్ చేస్తున్నాయి. ఇవ్వాల ఉదయం మడకశిర నుండి కర్ణాటక వైపు వెళ్లే మార్గంలో మిడిగేశి నుండి హనుమంతపురం వెళ్లే దారిలో గుంపులుగా ఎలుగుబంట్లు కనిపించాయి. కొందరు యువకులు వాటిని ఫోటోలు తీసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఎక్కువగా రాత్రిళ్ళు గ్రామాలపై దాడులు చేసే ఎలుగుబంట్లు పట్టపగలు గుంపులుగా తిరగడం సమీపంలో గ్రామాల్లో కలకలం రేపుతోంది. అలా గుంపులుగా తిరుగుతుంటే పొలాల్లో ఎలా తిరగాలని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది స్పందించి వీటిని ఏటైనా సుదూర అటవీ ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement