Saturday, April 20, 2024

ఐపీఎల్ నుంచి వెళ్లాలనుకుంటే మాకు అభ్యతరం లేదు: బీసీసీఐ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే… అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమ కుటుంబీకులు కరోనా బారిన పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వెదొలిగాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement