Thursday, April 25, 2024

ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు

ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు చేపట్టింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం త్వరలోనే భారత జట్టు ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్లతో జంబో జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు కరోనాబారిన పడకుండా బీసీసీఐ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. బ్రిటన్ విమానం ఎక్కేముందు ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోలుకున్న తర్వాత ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా పర్యటనకు ముందే ముంబైలో ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అటు ఆటగాళ్లందరికీ మొదటి డోసు టీకా ఇండియాలో, రెండో డోసును బ్రిటన్​లో ఏర్పాటు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement