Friday, March 29, 2024

100 కి.మీ. పూర్తి చేసుకున్న బండి సంజయ్ పాదయాత్ర

టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. 10వ రోజైన సోమవారం నాడు మోమిన్‌పేట నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర 100 కి.మీ. పూర్తి చేసుకుంది.

కాగా బండి సంజయ్ పాదయాత్ర 100 కి.మీ. పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి బెలూన్లు ఎగరేసి సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు 100 కిలోల కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి కార్యకర్తలు ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా కార్యకార్తలు పాల్గొన్నారు. కాగా కేసీఆర్‌ పాలనలో ప్రజాసమస్యలు ఏమాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదని పలువురు తమ దృష్టికి తీసుకొస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement