Friday, April 26, 2024

బండి సంజయ్ పై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం..కేసీఆర్ స‌ర్కార్ రైతుల ప్ర‌భుత్వం..

జనగామ : జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. కేసీఆర్ స‌ర్కార్ రైతుల ప్రభుత్వామని అన్నారు. రైతే రాజు కావాలని కెసిఆర్ పని చేస్తున్నారని… దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు పై స్పష్టమైన వైఖరిని తెలపాలని… పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వార్నింగ్‌ ఇచ్చారు. రైతులను ఆందోళనకు గురిచేయడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటు అయిపోయిందని… ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement